Tuesday, March 12, 2013

మిధునం - తెలుగు సినిమా



శ్రీరమణ రచించిన మిధునం కధ ని సినిమా గా తీసిన తనికెళ్ళ దశ భరణి గారి చిత్ర రాజములోని కొన్ని అధ్బుతమైన డైలాగులు, నలుగురికి చెప్పి వాళ్ళని ఆ అద్భుత కళా ఖండాన్ని చూసేలా చెయ్యాలన్న తాపత్రయమే తప్ప, ఏవో copy rights అవీ ఉల్లంఘించాలని కాదుసుమా!!!




Ø దాంపత్యమూ - ధప్పళము (గుమ్మడికాయ ముక్కల పులుసు )....మరిగిన కొద్దీ రుచి"

Ø దొంగ బెల్లం ...దొంగ ముద్దు, అనుభవిస్తే కాని తెలియదు"

Ø అంతే కాని ఇప్పుడు? ప్రతీ వాడికి శంఖు చక్రాల్లా బీపీ, షుగరూ....!!!
ఎందుకు రావు? 
నీళ్ళకి స్విచ్చి, నిప్పులకి స్విచ్చి, పచ్చడికి స్విచ్చి, పిండికి స్విచ్చి....ఆఖరికి ఆ స్విచ్చివేసుకోడానికి ఓపిక లేకుండా దానికి కూడా ఓ రిమోటు స్విచ్చి!!!!"

Ø మనిషిగా పుట్టడం సులువేనయ్యా...కాని మనిషిలా బ్రతకడమే కష్టం"

Ø ఒక్కడ్నో ఇద్దర్నో కంటా వనుకుని పెద్దవాడికి కృష్ణా అని పేరు పెట్టాను...ఏడాది తిరగకుండా పుట్టుకోస్తుంటే.. ప్రతీ సంవత్సరం పేర్ల కోసం ఎక్కడ అఘోరించడం అనీ.............ఇంకా నావల్లకాక...కేశవ నామాలు అందుకున్నా...!!"

Ø ఊరగా............ఊరగా....ఊరగాయ.
కోరగా ....కోరగా.........కొబ్బరి"

Ø కలలు కన్న దేశానికి వెళ్ళాకా ...కన్న దేశం కలలోకి వస్తుంటుంది"

Ø " అదే మనం Air-India flight ఎక్కామనుకోండి? మన air-hostess కాఫీ తెచ్చేలోపు అమెరికా వచ్చేస్తుంది